‘లాక్​డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతా’

కరోనా వల్ల క్రికెట్ నిలిచిపోవడంతో బౌలింగ్​ను తాను చాలా మిస్సవుతున్నానని, అందుకే లాక్​డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతానని టీమ్​ఇండియా స్పిన్నర్​ యజ్వేంద్ర చాహల్​ చెప్పాడు. టీవీ ప్రెసెంటర్ జతిన్​తో చాహల్ శుక్రవారం మాట్లాడాడు. “ఒక్కసారి బయటకు వెళ్లేందుకు అనుమతి వచ్చాక నేను ఇంటికి వెళ్లకుండా లాక్​డౌన్ విధించుకుంటా(నవ్వుతూ). మళ్లీ ఇంటికి వెళ్లను. ఇక ఎక్కువ కాలం ఇంట్లో ఉండలేను. ప్రస్తుతం ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నందున కనీసం మూడేండ్ల పాటు తిరుగుతూనే ఉంటా. దగ్గర్లో ఉన్న హోటల్​లో ఉంటా గానీ ఇంట్లోకి వెళ్లను” అని చాహల్ సరదాగా చెప్పాడు.


“నాకు మైదానానికి వెళ్లాలని, బౌలింగ్ చేయాలని ఉంది. క్రికెట్​నిలిచిపోవడంతో బౌలింగ్​ను చాలా మిస్సవుతున్నా. గ్రౌండ్​లో ఉంటే మంచిగా అనిపిస్తుంది. లాక్​డౌన్ మిగిసిన వెంటనే మైదానానికి వెళ్లి ఒక్క బంతైనా వేస్తా” అని చాహల్ చెప్పాడు. లాక్​డౌన్ పార్ట్​నర్​గా ఎవరిని ఇష్టపడతావని అడుగగా “రోహిత్​ శర్మ, కుల్​దీప్ యాదవ్​ను ఎంపిక చేసుకుంటా” అని చాహల్ అన్నాడు.