రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గవర్నర్కు జగన్ వివరించారు. చాలా రోజుల తర్వాత గవర్నర్తో సీఎం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్థం రాజ్భవన్ లంచ్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వివిధ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
గవర్నర్ను కలిసిన సీఎం జగన్ దంపతులు